Saturday, February 13, 2010

శ్రీకృష్ణ కమిటి ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాం?

శ్రీ కృష్ణ కమిటి విధివిధానాలు తెలంగాణా ప్రజలను తీవ్ర అసహనానికి గురిచేస్తున్నాయి.వ్యతిరేకించడానికి ముఖ్య కారణాలు:
1.తెలంగాణా ఇస్తే ఏర్పడబోయే సమస్యలు ఏంటి,వాటి పరిశ్కారలేంటి?దీనికి కమిటి వేసిఉంటే హర్షించేవాళ్ళం,కనీసం తెలంగాణా రాష్ర ఏర్పాటు ఎందుకు అడుగుతున్నారు?ఎటువంటి ఒప్పందాలు జరిగాయి ?ఎంతవరకు ఉల్లంఘనకు గురయ్యాయి?ఈ వాదన లో నిజమెంత అని కమిటి వేసినా ఒప్పుకునేవాళ్ళం.కానీ 53 ఏళ్ళ తెలంగాణా కు ,53 రోజుల సమైక్య వాదానికి ముడిపెట్టడం తెలంగాణా ప్రజల ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది.తెలంగాణా లో రెండు వాదాలుంటే వేరు,ఇక్కడే ఒకటే వాదం తెలంగాణా వాదం ,వీళ్ళు కలిసుండాలో ,విదిపోవలో ఆంధ్ర వాళ్ళని అడుగుతాం అంటే ఎంత నీచంగా ఉంది.
2.తెలంగాణ ఉద్యమానికి అసలు మూలము నది జలాల సమస్య,దాని ప్రస్తావన లేదు .
౩.ఇడ్లి సాంబార్ గో బ్యాక్ కావొచ్చు,ఆంధ్ర వాలా భాగో కావొచ్చు ఆ నినాదాలు రావడానికి ఇక్కడి కొలువులు అక్కడి వారు దోచుకోవడం,ముల్కి ,610 జి.ఒ ఉల్లంఘన.మరి ఆ ఉద్యోగుల ప్రస్తావన లేదు.
4.వీళ్ళు వేసిన అభివృద్ధి కమిటి కి 10 నెలల గడువు అనవసరం,ఇది కేవలం కాలయాపన చేసి ఉద్యమాన్ని నీరు గార్చేతందుకే .విదివిధనాలోన్నే పక్షపాతం ఉన్నాక రాబోయే రిపోర్ట్ తెలంగాణా కు అనుకూలంగా ఉంటుందని ఎలా విశ్వసిన్చామంటారు తెలంగాణా జనాలని?
5.పోనీ ఈ కమిటి కి రాజ్యాంగ బద్ధత ఉందా అంటే లేదు ? రేపు ఈ కమిటి సిఫార్సులు సమైక్యవాదులు ఒప్పుకుంటారని లేదు.
కమిటి ని స్వాగతించే తెలంగాణా వాళ్ళెవరన్నా ఉంటె,వాళ్ళందరూ నిజంగా తెలంగాణా ఉద్యమ ద్రోహులు,ఇంకా అనుమానమే అవసరం లేదు.
తెలంగాణా గాయపడిన దేహం తో ,అవమాన భారం తో,మోసపోయిన దీనత్వం తో,మళ్లీ ఉద్యమానికి కదులుతుంది..
ఈ కన్నీటి కథ కు అంతం పలికే దెప్పుడో? ఇంకెన్ని ఉద్యమకుసుమాలు నేలరాలాలో ,ఇంకెన్ని అసువులు మంటల్లో కాలాలో ?

No comments: