Friday, May 28, 2010

నరం నరం ఒకే స్వరం ,సమరమే ఇక మా పథం .

అనుకున్నట్టే యువరాజ వారు (వై.యస్ జగన్)ఓదార్పు యాత్రకు బయలుదేరారు ఇంటర్సిటీ ఎక్ష్ ప్రె స్స్ లో ..కొండా దంపతులు ,పుల్ల పద్మావతి గ్రూపులు మహుబ్బాద్ కి చేరుకున్నాయి స్వాగతం పలకడానికి...పాపం వారు అనుకోనివే కొన్ని జరిగాయి...జగన్ యాత్రకి అడుగడుగునా నిరసనలు,కొన్ని చోట్ల పట్టాలు పెకేస్తే,కొన్ని చోట్ల వెలది మంది పట్టాల మెడ పడుకున్నారు,కొంతమంది రాయి పెడ్తే,కొంత మంది చెట్లు నరికి అడ్డంగా వీసారు,నినాదాలు ఇచ్చారు,రుబ్బెర్ తయరు లు కాల్చారు.యాత్ర ను వంగపల్లి లో అపకా తప్పలేదు..ఇటు మహుబ్బాద్ లో కొండా అనుచరుల భీభత్సం,రాళ్ళతో తిప్పి కొట్టిన తెలంగాణా జనం..కొండా మురళి స్వయం గా కాల్పులు జరిపి ఒకరి మృతికి కారణం అవ్వడం..దీనితో అత్తకి అల్లుడిని అదుపు లోకి తీసుకోవడం తప్పలేదు..

అందరు వద్దని చెప్పినా పెడచెవిన పెట్టి ఓ మూర్ఖుడు దండయాత్ర తలపెట్టాడు,కాని ప్రభుత్వం ముందస్తుగా అరెస్స్ట్ చేయకుండా అలసత్వం చూపడం క్షమించలేనిది..ఎందుకంటే ఇంతమంది తెలంగాణా ప్రజల ప్రాణాలు పోవడానికి ఈ అలసత్వమే కారణం.తెలంగాణా m.p కో నీతి ,సీమంధ్ర m.p కి మరో నీతి..సమైక్యాంధ్ర లో అడ్డు అదుపు లేని ద్వంద్వ ప్రమాణాలు.ఈ మూర్ఖున్ని సమర్థించే మర్రిన్ని మూర్ఖపు మూకలు మీడియా ముందుకొచ్చి చిన్డులేస్తున్నాయి..
ఇలాంటి పరిస్థితుల్లో రేపు శ్రీకృష్ణ కమిటి రిపోర్ట్ ఇచ్చినా దాన్ని ఎవరన్నా ఖాతరు చేస్తారా అనేది నేడు తెలంగాణా ముందున్న పెద్ద ప్రశ్న.అందుకే ఓరుగల్లు సమర ఢంకా తో తెలంగాణా తెలిపింది ఇక మేము సై అంటే సై ,ఇక మా నరం నరం ఒకే స్వరం ,సమరమే ఇక మా పథం .