Thursday, May 13, 2010

సింహాలు..గుర్రాలు..ప్రజా పథాలు..ఓదార్పు యాత్రలు..నిట్టూర్పులు.

ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికలు లేకున్నా,వడగాల్పులు వీస్తున్నా ,ఎండనక,కష్టమనుకోక పర్యటనల మీద పర్యటనలు చేస్తున్నాయి.ముందుగా బాలకృష్ణ సింహ సినిమా హిట్ యాత్ర,పార్టీ అధ్యక్ష పదవి ముందు ముందు తెస్కోవచ్చు అని సూచించడం,చంద్రబాబు సై అనడం,ఇప్పుడైతే రాజ్యసభ కెల్త ,ముఖ్యమంత్రి పదవి ఇప్పుడే అవసరంలేదని చేపుకోవడం...బాలకృష్ణ గారి సినిమా కంటే ఈ కత కొంచం ఆకర్షనీయంగా ఉన్నా.. బాలకృష్ణ గారికి ,చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఆశలు ఉన్నాయి ,తెలంగాణా జనాలు మల్లి మల్లి వేర్రోల్లై వీళ్ళకి వోట్ వేస్తారు,గెలిచేస్తారు,పదవులు పంచుకునే పనిలో మునిగిపోయారు..వెర్రి జనం విస్తు పోయి చూస్తున్నారు.

మరో సినిమా స్టార్..చిరంజీవి..ఈయన రాజకీయాల్లోకి వచ్చినా నటించడం వదలట్లేదు ,రాజకీయం నేర్వట్లేదు..ఈల వేస్తె అభిమానికి క్లాస్..గుర్రపు స్వారి...పోలవరం మీద ప్రత్యేక ప్రేమ..దాని మీద పోరాటం..అక్కడి జనాలు అందలం ఎక్కిస్తున్నారో లేదో తెలీదు కాని ,ఇక్కడి జనాలు గాడిద మీద ఎక్కించి స్వారి చేయిస్తున్నారు..ఈయన్ని విమర్శించడం కూడా వృధా ,ఎందుకంటే తెలంగాణలో prp అంటే ప్రజలు లేని పార్టీ.ఇక్కడ తాగడానికి గుక్కెడు నీళ్ళు దొరకక ప్రజలు అల్లాడుతుంటే అక్కడ మూడో పంటకు వేసే ప్రాజెక్ట్ మీద ఈయన ఏనామాలిన ప్రేమ.. జనాలు అసహాయులై ఈ నాటకం చూస్తున్నారు..

రోశయ్య గారి ప్రజాపథం,జగన్ గారి ఓదార్పు వ్రతం..పాలకపక్షం కాంగ్రెస్ ఏ ,ప్రతిపక్షం కూడా కాంగ్రెస్ ఏ.తెలంగాణా ఇచ్చేది నేషనల్ కాంగ్రెస్ ,తెచ్చేది తెలంగాణా కాంగ్రెస్,ఆపేది ఆంధ్ర కాంగ్రెస్..ఈ మాయాబజార్ నాటకం కాంగ్రెస్ ఇప్పట్లో ఆపేలా లేదు..ఉప ఎన్నికల్లో వీళ్ళని గెలిపిస్తే తెలంగాణా కు బలం వస్తుందట పొన్నం గారి వ్యాఖ్య.. పదవులకు అమ్ముడుబోయే గొప్ప గొప్ప నాయకులు ఈ తెలంగాణా గడ్డ మీద ఎందుకు పుట్టారా అని జనాలు ఈసడించుకున్న వీళ్ళకి వినిపించదు ,కనిపించదు..

ఇంత వాడి వేడి నాటకం జర్గుతుంటే జనాలు నిట్టుర్పులకి పరిమితమయ్యారు..ఎందుకంటే ప్రజాస్వామ్యం లో అతి బలహీనమైన జీవులు ప్రజలే...ఈ సారి ఉపఎన్నికల్లో వోటు ని వాడుకుంటారో,అమ్ముకుంటారో,తెలీదు కానీ ఈ నేల మీద పుట్టబోయే బిడ్డల భవితవ్యం ఏ తేరుకోలేని నిశీధి లోకి నేట్టివేయబడుతుందో ఆలోచించుకోవడానికి భయం గా ఉంది..