Monday, February 22, 2010

ఆంధ్ర చావులు నాగరికం..తెలంగాణా చావులు ఆటవికం..


మా యాదగిరి కాల్చుకొని చచ్చిపోయాడు,తల్లి లేదని కాదు,తండ్రి లేడని కాదు,తెలంగాణా రాలేదని.ఒక అనాధ ఆశ్రమం లో పదవ తరగతి వరకు చదివాడు.హొటెల్ లో కాషియర్ గా పార్ట్ టైం చేస్తూ ,ఇంటర్ చదువు కుంటున్నాడు,అంతే కాదు ఆ ఆశ్రమం లో అనాధలకు అండగా నిలిచాడు.అగరుబత్తులమ్మి అంధులకు ఆసరా గా నిలిచాడు.తెలంగాణా పోరాటం లో తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించాడు,పోరాడాడు.ఛలో అసెంబ్లీ లో పాల్గొన్నాడు,ఆత్మాహుతికి సిద్ధ మయ్యే వచ్చాడు.
ఆ ఉత్తరం చదువుతుంటే,ఆ అమాయకత్వానికి,ఆ బాధకు కరుగని గుండె ఉండదు,తెలంగాణా లో ఏడవని కన్ను ఉండదు.
ఇంత చేసినా తను వోట్ వేసిన సబితమ్మ గుండె కరుగలేదు,ఆ కాంగ్రెస్ నేతల మనసు మారలేదు.సరికదా సీమంధ్ర నేతలు అసలు అతను విద్యార్థి కాదని కొట్టిపారేశారు.అంతటి అహంకారం,అంతులేని కరుడత్వం.
ఒక్క పొట్టిశ్రీరాములు చచ్చిపోతే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలి,ఆయన మీద నాన్ డీటైల్ మేము తర తరాలు చడువాలి.కాని మా సాయుధ పోరాట చరిత్ర చదువొద్దు.ఎందుకంటే ఆంధ్రా వాళ్ళ చావులు నాగరికం,తెలంగాణా వాళ్ళవి ఆటవికం..మహారాష్ట్ర లో కర్ణాటక లో తెలంగాణా విమోచన దినం చేస్కోవచ్చు కానీ తెలంగాణా లో కూడదు ,ఎందుకంటే మాకు విమోచన రాలేదు,మేమింకా ఈ ఆంధ్రా పాలకులకు బానిసలం. మా విద్యార్థులు మరణాలకు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నే కారణం,చాలావరకు తె దే పా దోరణి కారణం.
ఇంకెందుకు శాంతి మార్గం,ఒక్క యాదగిరి ఎందుకు చావాలి,ఒక్క శ్రీకాంత్ మరో వేణుగోపాల్ ఎందుకు మరణించాలి,ఇవాళ తెలంగాణా అందరి ఆశయం ,మరణమే శరణ్యం అయతే అది అందరం కలిసే చేయొచ్చు,పోరాటమే మార్గం అయతే మరో సాయుధ పోరాటం కి మార్గం వేయొచ్చు.మన పెద్ద మనసు మన బిడ్డల ప్రాణాలను,ఆఖరికి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది.ఇంకా ఉపేక్షించి లాభం లేదు.వెనకటనే గాంధీ ఇక్కడ సత్యాగ్రహం కూడదని హుకుం జారి చేసాడు,ఒంటరులం,నేలను రక్తం తో తడిపి సాధించుకున్నాం.ఇవాళ మళ్లీ ఒంటరివాళ్ళం,మన దిక్కు మనమే,మన నుదిటి రాత మళ్లీ మనమే రాసుకోవాలి,రాస్తున్న ఈ క్షణం లో కూడా వార్త వస్తుంది,సరిత అనే అమ్మాయి తెలంగాణా కోసం ఆత్మాహుతి,నిన్న సవేరా ,ఇంకా ఎందరో ౩౦౦ దాటాయి,౩౦౦౦ దాటినా ఈ ప్రజాస్వామ్యం మనల్ని కనుకరించే సూచనే లేదు.
ఇవాల్టి నినాదం విజయమో ,వీర స్వర్గమో..పోరాటమో ప్రాణ త్యాగమో..ఇంకా వేచి ఉంటె లాభం లేదు,ఇంకో మార్గం లేదు ,ప్రాణాలను పనం పెట్టే మరో సాయుధ పోరాటం,ఇదే రాబోయే తెలంగాణా పోరాట విధి విధానం..