Thursday, February 18, 2010

లఠీలు...తూటాలు ... రాజకీయ రంగులు..

తెలంగాణా అంతా ఆందోళనగా ఉంది.తెరాస రాజీనామాల బాట పట్టారు.కాంగ్రెస్ మొండి చేయి చూపించింది.తె దే పా తనదైన శైలి లో నాటకాలు ఆడుతుంది.ప్రజల సహనానికి పరీక్ష ,విద్యార్థులకు లాఠీలతో శిక్ష.ఇదంతా అనుకున్నదే..
ఫెబ్రవరి 14 ,2010..తెలంగాణా చరిత్ర లో బ్లాక్ డే.ఉస్మానియా విశ్వవిద్యాలయం లో చదువుల చెట్టుకు ,ఖాఖి చెదలు పట్టాయి.డఎర్ మళ్లీ జాయింట్ కమీశ్నర్ సీతారామాంజనేయులు లా తిరిగి పుట్టాదేమో..ఇది భారత స్వతంత్ర ఉద్యమం లో జరిగిన జలియన్ వాల భాగ్ ఆ అనిపించింది.గేట్లు మూసేసి,వేల కొద్ది బలగాలు మొహరించి,అబ్బాయి ,అమ్మాయి అని తేడా లేకుడా చితకబాదారు,దుర్భాషలాడారు,భాషప వాయువు వదిలారు,ఎన్నో రౌండ్లు రుబ్బెర్ బుల్లెట్లు తో కాల్చారు...
వీరంగం ఇంకా ఆగక ,మీడియా వాళ్ళ తలలు బద్దలు కొట్టారు,రక్షణ కవచం లా వాడుకొని విద్యార్థులు రాళ్ళు విసిరితే వాళ్ళకి తగిలేలా చేసారు,మీడియా బండ్లను పోలీసులు తగలబెట్టారు...
ఇంత నిరంకుశమైన కాంగ్రెస్ పాలనా విధానాలు ,యావత్తు ప్రజాస్వామ్యానికే మచ్చ తెచ్చాయి..తె దే పా ఖండించింది మరి వెళ్ళలేదు?ఆపలేదు? ఎందుకో తెలంగాణా ప్రజలు అడిగితె మళ్లీ తప్పు ? కాంగ్రెస్ అయతే పోలీసులను వెనకీసుకోచ్చింది ,అసెంబ్లీ లో హొమ్ మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ పూర్తిగా అబద్దం.. హైకోర్ట్ సింగిల్ బెంచ్ అక్షంతలు వేస్తె ప్రభుత్వం ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనానికి వెళ్ళింది,అది తిడ్తే ఏకంగా సుప్రీం కోర్ట్,ఇవాళ అది అక్షింతలు వేసింది..అయనా ప్రభుత్వానికి చలనం లేదు..నిరకుశాత్వానికి పరాకాష్ట ఈ రోశయ్య ప్రభుత్వం.
తెలంగాణా కష్టాలు ప్రజలు తెచ్చుకున్నవే కాంగ్రెస్ కి వోట్ వేసి,గెలిపించి..ఈ శిక్ష తప్పదు.రాజకీయాలు కాదు ఉద్యమం తో వస్తది అన్నది కూడా తప్పే,రాజకీయ ప్రక్రియ లేకుండా ఎంత ఉద్యమించినా జరుగదు..ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి,తెరాస ఒక్క సీట్ బై elections లో ఓడిపోయినా తెలంగాణా ఉద్యమం ఇంకో తరం వెనక్కి పోతది..కే సి ఆర్ రాజీనామా తప్పో ఒప్పో ఏదో ఒక ప్రయత్నం జరుగుతుంది,విమర్శించే విష్ణు నే ఆమరణ దీక్ష కు కుర్చోమనే ప్రజా చైతన్యం రావాలి..ఇవాళ కోడిగుడ్లు తో దాడి కాదు,రేపు వోట్ల తో ఈ పార్టీలను శాశ్వతంగా వెలివేయాలి..అవసరమొస్తే భా జ పా కైనా అవకాశం ఇవ్వాల్సిందే,తెలంగాణా తెచ్చుకోని తీరాల్సిందే..ఇప్పుడు కావాల్సింది ఉద్యమం కాదు,ఆవేశానికి సరైన ఆలోచన ,కొంత సహనం ,సంయమనం,మనల్ని మన ఉద్యమాన్ని కాపాడుకోవడం..