Thursday, February 11, 2010

రాష్ర విభజన అంటే కేకు కట్ చేయడం కాదు..

రాష్ట్ర విభజన అంటే కేకు కట్ చేయడం కాదు..ఇది మన రాష్ట్ర, సారి, మన గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిఁ వీరప్ప మొయిలి గారి మాట,ఢిల్లీ j m u తెలంగాణా విద్యార్థులు నిలదీస్తే చెప్పిన సమాధానం.మరి ఇంత కష్టమైన పనిని,అంత సులువుగా మీ ఎన్నికల మానిఫెస్టోలో ఎలా చేర్చారో సెలవిస్తారా..?ఇదే ప్రశ్న తెదేపా పార్టీ కి కూడా వర్తిస్తుంది.
మాటే కదా అని వాడారే తప్పితే,ఇచ్చేది చచ్చేది లేదనుకొని వీరు వెలగబెట్టిన పని,ఇంత మంది తెలంగాణా తల్లుల కడుపు కోత,తెలంగాణా కి మరింత క్షోభ,ఇరు ప్రాంతాల మధ్య మరిన్ని విద్వేషాల మంట..
కే.వి .పి ఆస్తుల మీద చంద్రబాబు విమర్శలు,బాబు మీద చిత్రగుప్తుని లేఖాస్త్రాలు...తెలంగాణా మాటను తోవ నుండి తప్పించడానికి ఇరువురి కుటిల ప్రయత్నాలు..మధ్యలో ఇంకో ముసలినక్క బడ్గ్ద్గెట్ సమావేశాలు జరపాలని వంక తో కమిటి విధివిధానాలు రాకుండా కాలడ్డం పెట్టడం,సమీక్ష అంటూ తిరగడం,జై తెలంగాణా అంటే సహించకపోవడం.
తెలంగాణా వస్తదో రాదో తెలీదు కాని,ఈ వ్యక్తులను , ఈ రెండు పార్టిలను తెలంగాణా ప్రజలు శాశ్వతంగా బహిష్కరించాలేమో...ప్రజలంటే విలువలేదు,ప్రజాస్వామ్య మంటే గౌరవం లేదు,భారతి నేటి నీ దుస్థితి,ఈ దుర్యోధన దుష్యసన కీచక రాజకీయ చదరంగం లో నీ కన్నీటికి బేరం కట్టే స్తితి.
ఇవాళ దేశమంతా చదువుకున్న అజ్యానులు,లేకుంటే నాలుగు కోట్ల తోటి భారతీయులు ఇన్ని అవస్తలు పడుతుంటే ఏమయ్యిందని అడిగే నాధుడు లేదు,మన సమస్య కాదనుకోవడం దేశ సమైక్యతను పెంచుతుందా?చిన్న రాష్ట్రం అడగటం పెద్ద నేరం లా చూస్తున్నారు,ఈ అణగారిన మనుషుల గోడు ఒక సారైనా కనీసం వినరే?చచ్చేవాడి ఆఖరి కోరిక తీర్చాలంటారు,మరి 200 చావుల తరువాత కూడా మీలో ఆ మానవత్వం కదలట్లేదా?
గాంధీ పుట్టిన దేశం లో మా శాంతి సత్యాగ్రహాలు ధనికుల లాబీయింగ్ ముందు ఓడిపోతుంటే,ఆయన ఆత్మా ఎంత బాధపడుతుందో ..మళ్లీ పుట్టుకరావాలేమో ఆ నేతాజీ మా ఈ స్వరాజ్య సమరం లో... రేపటి తెలంగాణా మహొదయం లో...

No comments: