Saturday, July 31, 2010

భాద్యత ఎవరిది?

ఉప ఎన్నికలు ముగిసాయి,అందరం ఆకాంక్షించిన విధంగానే 12 చోట్లా కూడా రాజీనామా చేసిన వారినే గెలిపించారు..
సంబరం ఒక్క పూట కూడా నిలువలేదు..ఉస్మానియా లో ఇశాంత్ రెడ్డి ఆత్మహత్య..d.s ఓడిపోతే ప్రాణాలిస్తా అని మైసమ్మ తల్లికి మొక్కు..నమ్మకం మంచిదా కాదా అని పక్కకి పెడితే..అసలు d.s గెలుస్తాడా ఓడుతాడా ? ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది మన పిల్లల మనసులో?ఇంత తెలంగాణా ఉద్యమం కేవలం డబ్బుకి ,అధికారానికి,బెదిరింపులకి లొంగుతది అనుమానం ఎందుకొచ్చింది? మీడియా సృష్టి కొంతవరకి కారణం..నిజామబాద్ ప్రజల మౌనం,మొహమాటం,మీమాంస కూడా కారణం అని చెప్పక తప్పదు..

ఎలుగెత్తి తెలంగాణా కే వోట్ వేస్తాం అని రోడ్ల మీదకి రాలేదు..అత్మస్త్యర్యాన్ని ఇవ్వలేదు..కనీసం d.s సభలని బహిష్కరించలేదు..ఆ పెట్టె తిండిని తిరస్కరించలేదు..డబ్బులు తీసుకోకుండా ఉండలేదు..మౌనం వహించారు..వోట్ వేస్తె చాలనుకున్నారు..ఆ వోట్ వేస్తారో లేదో అని ఒక చాకలి శ్రీనివాస్ మరణించాడు..ఓ ఇషాంత్ రెడ్డి మొక్కు తీర్చుకున్నాడు..చావడం తప్పే..కాని పోరాటం లో మీతో మేమున్నాం అని ప్రజలు ధైర్యం ఇవ్వకపోవడం తప్పే..ఒక్క ఉద్యోగ సంఘం,ఒక్క కుల సంఘం..ఒక్క ఇల్లు..ఒక్క వాడ ..తెగింపు చూపించి ఉంటె ఈ ఇద్దర్ని కాపడుకునేవాళ్ళం..ఇప్పటికైనా ప్రజలు తెల్సుకోవాలి..
మీ మౌనం మీ బిడ్డలకి శాపం అవ్తుంది..
ఆత్మహత్యల్ని ఆపడం ఎవరి తరం కాదు..ప్రజలు కదిలి రాకుంటే..మేలుకోకుంటే..మీకు మేమున్నాం బిడ్డ,ముందు ఎనకాల కాదు,మీతోనే ఉన్నాం అనే చిన్న భరోసా ఇప్పటికన్నా ఇవ్వకుంటే..

ఉద్యమకారులకి కూడా ఒక మాట యుద్ధం లో చావంటే భయం ఎలా ఉండకూడదో ,ఓడిపోతాం అని భయం కూడా ఉండకూడదు..గెలుస్తాం అని తెగించి సింహలుగా పోట్లాడితేనే తెలంగాణా..లేకుంటే రోజుకో తల్లికి కడుపు కోత..
ద్రోహులు పదవుల్లో నాలుగు ఏళ్ళ కంటే ఎక్కువ ఉండరు..కానీ మీ భవిష్యత్తు 40 ఏళ్ళు ..ఎవరో భాద్యత తీసుకోవడం కాదు ముందు మన పోరాట భాద్యత,మన ప్రాణాల భాద్యత మనం తీసుకుందాం ..