Monday, November 1, 2010

అస్తమించిందా.?.అవతరించిందా.?

రాష్ట్ర అవతరణ దినం విద్రోహ దినం గా మారిన చారిత్రిక పరిస్తితి బహుశ ప్రపంచం లో ఇదే మొదటి సారి కావొచ్చు..ఇది విద్వేషాలు పెంచాదనికో,లేదా కేవలం నిరసన తెలపడానికో వాడిన పదం కాదు..ఆ మూడు అక్షరాల పదం లో మూడు తరాల ఆవేశం ,అణిచివేత వినిపిస్తుంది,ఇవాళ అందరిలో కనిపిస్తుంది..

నా చిన్నప్పటి నుండి నేను చూసిన ఒకే ఒక అవతరణ దినోత్సవ వేడుక చంద్రబాబు హయాం లో ,నేను 7/8 తరుగతి చదువుతున్నప్పుడు,వరంగల్ లో పెద్ద కార్నివాల్ జరిగింది..మా వరంగల్ మునిసిపాలిటి కి కూడా తెల్ల సున్నం వేసి,లైట్స్ పెడ్తే ఆనందంగా చూసాను..బహుశ తెలంగాణా జిల్లలల్లో ప్రభుత్వ కార్యాలయాలు అలా మెరిసిపోతూ ఎపుడూ కనబడలేదేమో..ఆ రోజు ఆటలు,పాటలు ,మీడియా ఛానళ్ళు అంతా సరదాగా జరిగింది..నా చిన్న మెదడుకి సందేహం ప్రతి ఏడు ఇలా ఎందుకు జరగలేదు అని..చంద్రబాబు నాయుడు లేడు ఇంత ముందు కాబోలు అనుకున్న..
తర్వాత ఏడు నవంబర్ ఒకటికి ఉత్సాహంగా చూసా మళ్లీ వేడుకలు జరగుతాయని..ఉహు ఎక్కడా ఆ ఊసు లేదు,ఎవరి మధ్య ఆ మాట కూడా లేదు,నాకు తెలిసిన పెద్దవాళ్ళని అడిగా ఎందుకు ఈ సంవత్సరం కూడా జరగట్లేదు అని..ఎవరు సమాధానం ఇవ్వలేదు మౌనం గా ఉన్నారు..రాష్ట్ర అవతరణ దినం ,పొట్టి శ్రీరాములు త్యాగ ఫలం,అయినా ప్రజలలో ఇంత నిర్లిప్తత ఎందుకు అనేది నాకు అప్పుడు అంతు పట్టని విషయం .
ఇపుడు అర్థమవ్తుంది ,తెలంగాణా ఆ రోజుకే విద్రోహం అని భావించిందని..మౌనగా ప్రకటించారని..తెలంగాణా గొంతు మూగబోయింది మూడు తరాలు..లేదా గొంతు నలిపారు అనొచ్చు..కాని బాధ తెలుపడానికి భాష అక్కర్లేదేమో..రోజు బడి లో పాడిన మా తెలుగు తల్లి పాట ఏ రోజు పరవశం తో పాడిన గుర్తు మాకెవరికి లేదు.. అప్పుడు అగ్యానం లో కూడా అభిమానం కలగలేదు అంటే తెలంగాణా లో ప్రజలు ఎలా మొక్కుబడిగా,మనసు లేకుండా,బ్రతుకుతున్నారో సమైక్య రాష్ట్రం లో అర్థమవుతుంది..
మాకు గోదావరి తెలంగాణా లో ప్రవహిస్తుందనే తెలీదు..పొట్టి శ్రీరాములు కి సమైక్య రాష్ట్రానికి సంబంధం లేదన్నది తేలేదు..నిజాం గురించి ఊర్లో అమోమ్మలు తాతలు చెప్తే కొద్దిగా తెల్సు..స్వతంత్ర సమరయోధులు అంతా చీరాల ,గుంటూరు వల్లే ,తెలంగాణా లో ఒక్కరు కూడా ఎందుకు లేరు అనేది మా అమ్మకు చదువుకునే టప్పుడు
వేధించిన ప్రశ్న..నాకు శ్రీ శ్రీ కవితలు తెల్సు..దాశరథి పేరే తెలీదు ..అల్లూరి సీతారామరాజు సినిమా చూసా,కొమరం భీం పేరు కూడా ఎన్నడు వినలేదు..మా నాన్నకు సెక్రటేరియట్ లో ఎందుకు పోస్టింగ్ ఇవ్వరో ఎపుడూ అర్థంకాలేదు..అసలు మా ఊర్లో పొలాలు ఎందుకు ఎండిపోతాయో తెలీదు. మా ఊర్లలో ఎవరికీ ఉద్యోగాలు ఎందుకు రాలేదో తెలీదు..మా ముస్లిమ్స్ అందరు గుల్ఫ్ కెందుకు వలస వెళ్తారో తెలీదు ..మా లంబాడి తండాల్లో ఆడపిల్లను ఎందుకు అమ్ముకుంటారో తెలీదు .
మేము చదువు కున్నాం ఆంధ్రను , తెలంగాణా బతుకును చదవలేదు , ఐనా తెలంగాణా ఇవాళ తలకెక్కింది అంటే ఎంతటి వివక్ష జరిగుంటే ,అనుభావిన్చుంటే మా హృదయాలు పుస్తకాల నుండి,పాఠాల నుండి వాస్తవం వైపు ,ప్రజా చైతన్యం వైపు అడుగులేసుంటాయి ..మా సీనియర్ డాక్టర్లు కన్నీళ్ళు పెట్టుకుంటూ చెప్పుకున్నారు ..మేము జీవితం అంత ఈ సమైక్య పాలన లో తీవ్ర వివక్షకు ,అవమానాలకు గురయ్యాం ..మా జీవితం ఐపోయింది ..మీ జీవితాలు మాల కాకూడదనే మా ఆరాటం ..అందుకే మాట్లాడ్తున్నాం ,పోట్లడుతున్నాం ..
తమకు అన్యాయం జర్గితే ఉరుకుంటారేమో కానీ బిడ్డలకు జర్గుతుంటే ఏ తల్లి,ఏ తండ్రి భరించలేరేమో ..అందుకే 20 ఏళ్ళ కిందటి మౌనం ఇప్పుడు లేదు..గొంతు కలపడమే కాదు ,గర్జించడానికి సిద్ధపడ్డారు ..
ఈ నవంబర్ 1 రాష్ట్ర అవతరణ దినం కాదు..రాష్ట్రం అస్తమించిన దినం..దేశం అంటే మట్టి కాదు ,ప్రజలని నమ్మితే ..ప్రజలు విడిపోయారు ,ఇపుడు మట్టే మిగిలింది ..మరి రాష్ట్రం ఇవాళ అస్తమించిందా ? అవతరించిందా? విజ్యులకు అర్థంకానిదేమికాదు..