Friday, September 10, 2010

తెలంగాణా ఓ పండోర..

ఇవాళ కొమరం పులి సినిమా టైటిల్ మీద గొడవ అవుతుంది,కొమరం భీం లాంటి పోరాట యోధుని పేరు మీద ఓ కమర్షియల్ మాస్ మసాల సినిమా ,తిట్టిపోయడం లో తప్పేం లేదు,కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఒక ప్రాంతం వ్యతిరేకిస్తే మరో ప్రాంతం ఆహ్వానిస్తుంది..సమైక్యత అంటే ఇదేనేమో కాబోలు..
చిరంజీవి పిల్లి,అల్లు వారి చింపాంజీ,పవన్ కోతి, అని పేర్లు పెట్టి సినిమాలు తీస్తే అర్థమవ్తుందేమో మనోభావాలు అంటే ఏంటి,పేరు పెట్టడం అంటే ఏంటి..అని..

ఒక పోతిరెడ్డిపాడు మీదనో ,పోలవరం మీదనో ఇరు ప్రాంతాల వారు వాదించుకుంటున్నారు అంటే నీటి సమస్య బతుకు సమస్య..కాని తెలంగాణా నేత పేరు ని అవమానిస్తే ఆహ్వానించడం ఏమని అర్థంచేస్కోవాలి.. తెలంగాణా విమోచన దినం ఆంధ్ర ప్రాంతం వ్యతిరేకిన్చవలసిన అవసరం నిజంగా ఉందా? వారికీ వారి హక్కులకు ఎమన్నా భంగం కలుగుతుందా ..
పోలీసు ఆక్షన్ చేయించి తెలంగాణా ని విముక్త పరచిన సర్దార్ వళ్ళభాయి పటేల్ విగ్రహం పెట్టకూడదు కాని తెలంగాణకు అన్యాయం చేసిన ఓ సైతాను విగ్రహం తెలంగాణా వాడ వాడ న పెట్టాలని ప్రయత్నిస్తే,రాళ్లు విసరక పూల మాలలు వేస్తారని ,వేయాలని ఎందుకు అనుకుంటారు?

వై.ఎస్ బ్రతికుండగా తెలంగాణా కి నీళ్ళు ఇవ్వలేదు ,నిధులివ్వలేదు,హక్కులివ్వలేదు,బతకనివ్వలేదు,భూములు కబ్జా, ఇవన్ని చాలదన్నట్టు మధ్య తరగతి వాడు అతి కష్టంగా నిలదోక్కున్నది కేవలం కష్టపడి ఐ.టి ఉద్యోగాలు చేస్కుంటూ..ఆలాంటి ఐ.టి ని సర్వనాశనం చేసారు..సత్యం కంప్యూటర్స్ పైకి తెలిసిన కథ వేరు,జర్గిన కథ వేరు..రాజ వారు ముచ్చటగా 500 కోట్లు రెండవ దఫా ముఖ్యమంత్రి కావడానికి 2009 election ప్రచారానికి రామలింగ రాజు ని ఇవ్వమని ఆదేశించారు..కుదరదని విన్నవించుకుంటే ,గెలిచిన వెంటనే యువరాజ వారు దేహ శుద్ధి చేసారు..దానితో పులి సవారీ చేయలేనని సత్యం వెనుక అసత్యం బయటపెట్టి హ్యాపీ గా niims కెళ్ళి పడుకున్నారు..భారత దేశ it వ్యవస్తకే మాయని మచ్చని తెచ్చిపెట్టారు..షేర్ ల లో లక్షల మంది మునిగారు,వేల మంది ఉద్యోగాలు పోయాయి,అస్తవ్యస్తం అయింది..ఇందులో ఆంధ్ర ప్రాంతం వారు నష్టపోయారు ,తేడ ఏంటంటే ఇక్కడ ప్రజలు చైతన్య పడుతున్నారు,అక్కడి వారు ఇంకా ఆ మాయ లోనే ఉండిపోయారు..

అంతెందుకు ఇవాళ హైదరాబాద్ మాది మాది అని ఇంతగా అందరు గొంతు చించుకుంటున్నారు..హైదరాబాద్ లో పరిశ్రమల కాలుష్యానికి కూరగాయలు ,పండ్లు,భూమి,నీళ్ళు ప్రతీది ప్రాణ సంకటం గా మారింది..ఒక్క ప్రమాదం చాలు హైదరాబాద్ భారత దేశ చరిత్ర లో మరో భోపాల్ అవుతుంది..ఆ రోజు కాలుష్యం ప్రాంతాల వారిగా చంపదు..మోహన్ బాబు కి ,చిరంజీవి కి,చంద్ర బాబు కి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వదు..ఇవాళ చేసే వితండ వాదం రేపటి కి ఎంత ప్రమాదమో ప్రజలు గమనించట్లేదు..

ఈ ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం లో నాశనం అయ్యాం అని తెలంగాణా వాల్లంటుంటే ,మేమేం బాగుపడలేదు అని సీమంధ్ర వాల్లంటున్నారు ,మరి ఈ సమైక్య రాష్ట్రం ఇన్ని ఏళ్ళు గా సాధించిన్దేంటి ?ఎవరిని ఉద్దరించిందని ఇంకా కలిసుండాలి?
హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే సీమంధ్ర ప్రజలకు నిజంగా ఒరిగేదేంటి?కబ్జాదారుల ఆస్తులు కాపాడటానికి ప్రజలు,విద్యార్థులు ఉద్యమిన్చాలా? మా కన్ను గుడ్డిడైతే ,మీ కన్ను మెల్లదైంది,అంతకుమించి ఆంధ్రప్రదేశ్ సాధించింది ఏం లేదు.

తెలంగాణా ని ఒక పండోర దీవి ని చేసారు..అణువణువునా ఖనిజాలు ఉన్న భూమి ని దోచుకోవడమే కాక,ఇక్కడి ప్రజల సెంటిమెంట్స్ మీద అణిచివేత చేసారు..చేస్తున్నారు..ఇలాంటి కలిసుండే సిద్ధాంతాన్ని ప్రపంచం లోని ఏ ప్రాంతం ఒప్పుకోదు.. ఏ జీవజాలం ఒప్పుకోదు..చీమ కూడా దాని పుట్ట మీద కాలేస్తే తిరగబడి కుడుతుంది ,మనిషి బరువు కి నేనెలాగు చస్తా కదా అని పోరాటం ఆపదు..తెలంగాణా అంతే తీవ్రంగా తిరగబడుతుంది..మనషి ప్రక్రుతి దైవం మూడు విడదీయలేనివి .. ఆ సినిమా లో కథ కల్పితం కాని అంశం వాస్తవం..తిరగబడే రోజు ప్రక్రుతి దేవుడు కూడా తెలంగాణా సామాన్య మనిషికి తోడుగా నిలబడుతారు ..

No comments: