Tuesday, May 25, 2010

ఓదార్పు మాకొద్దు..!

తెలంగాణా చైతన్యాన్ని ,తెలంగాణా వాదం బలాన్ని,ఈ ఆత్మగౌరవ పోరాటాన్ని ఎలా అభినందించాలో అర్థంకావట్లేదు.
రాష్ర సాధనకై అసువులు బాసిన అమరులు నిజంగా ఇవాళ సంతోషిస్తారు,వాళ్ళు మరణించినా ,వాళ్ళ వాదం,భావజాలం బ్రతికిఉన్నన్దుకు.ఆర్థిక సాయం పేరుతో తెలంగాణా లో సమైక్య వాణిని వినిపించడానికి వస్తున్న జగన్ ఓదార్పు యాత్ర,దానికి తాన తందానా అంటున్న కొంతమంది చంచాలు..గొప్పను కొని పోయారు తెలంగాణా పల్లెల్లోకి..డబ్బులిస్తాం అని..వీళ్ళని కనీసం కలవడం ఇష్టం లేని పృథ్వీ తల్లితండ్రులు,ఇంటికి తాళం వేసి ,ఉత్తరం పెట్టి వెళ్లారు,ఇస్తే నా బిడ్డ ప్రాణాలు ఇయ్యండి,లేకుంటే తెలంగాణా ఇవ్వండి ఆని..మరో రాజ్ కుమార్ కుటుంబం తెలంగాణా ఇవ్వండి ,ఆంధ్ర వాడి దగ్గర సాయం తెసుకోము ఆని తెగేసి చెప్పారు..తిరస్కరించారు..కొండ సురేఖ గారు ఇంకా చేసిన తప్పుకి నాలుక కర్చుకున్నారో లేదో..జగన్ గారు ఖంగు తిన్నారో లేదో..కాని తెలంగాణా తల్లితండ్రుల త్యాగానికి తెలంగాణా అంతా సలాం పలుకుతుంది..
అటు వరంగల్ బంద్,ఇంకో వైపు ysr విగ్రహం ద్వంసం ,మరో వైపు చలో మహబూబాబాద్,జగన్ మీద సొంత పార్టీ తెలంగాణా నేతల ఆగ్రహం..నేను పట్టుకున్న కుందేలుకి మూడే కళ్ళనే యువరాజావారి మంకుపట్టు...కోరి అవమానాల పాలైతా అంటే ఎవెరెందుకు ఆపడం..రానివ్వండి...నిన్న లేని ధైర్యం ఇవాళ ఉంది..నేతలు రాతలు మరకున్నా ప్రజా శక్తి లో కొత్త మార్పు చేకూరింది..ఇపుడు నిలదీస్తారు ,ఉతికి ఆరేస్తారు ఆని నమ్మకం ఉంది.. ఇపుడు పోరాడితే పోయేది ఏమి లేదు ,ఆంధ్ర బానిస సంకెళ్ళు తప్ప..

1 comment:

Mahesh said...

jai telangana

jai jai telangana........