Friday, May 28, 2010

నరం నరం ఒకే స్వరం ,సమరమే ఇక మా పథం .

అనుకున్నట్టే యువరాజ వారు (వై.యస్ జగన్)ఓదార్పు యాత్రకు బయలుదేరారు ఇంటర్సిటీ ఎక్ష్ ప్రె స్స్ లో ..కొండా దంపతులు ,పుల్ల పద్మావతి గ్రూపులు మహుబ్బాద్ కి చేరుకున్నాయి స్వాగతం పలకడానికి...పాపం వారు అనుకోనివే కొన్ని జరిగాయి...జగన్ యాత్రకి అడుగడుగునా నిరసనలు,కొన్ని చోట్ల పట్టాలు పెకేస్తే,కొన్ని చోట్ల వెలది మంది పట్టాల మెడ పడుకున్నారు,కొంతమంది రాయి పెడ్తే,కొంత మంది చెట్లు నరికి అడ్డంగా వీసారు,నినాదాలు ఇచ్చారు,రుబ్బెర్ తయరు లు కాల్చారు.యాత్ర ను వంగపల్లి లో అపకా తప్పలేదు..ఇటు మహుబ్బాద్ లో కొండా అనుచరుల భీభత్సం,రాళ్ళతో తిప్పి కొట్టిన తెలంగాణా జనం..కొండా మురళి స్వయం గా కాల్పులు జరిపి ఒకరి మృతికి కారణం అవ్వడం..దీనితో అత్తకి అల్లుడిని అదుపు లోకి తీసుకోవడం తప్పలేదు..

అందరు వద్దని చెప్పినా పెడచెవిన పెట్టి ఓ మూర్ఖుడు దండయాత్ర తలపెట్టాడు,కాని ప్రభుత్వం ముందస్తుగా అరెస్స్ట్ చేయకుండా అలసత్వం చూపడం క్షమించలేనిది..ఎందుకంటే ఇంతమంది తెలంగాణా ప్రజల ప్రాణాలు పోవడానికి ఈ అలసత్వమే కారణం.తెలంగాణా m.p కో నీతి ,సీమంధ్ర m.p కి మరో నీతి..సమైక్యాంధ్ర లో అడ్డు అదుపు లేని ద్వంద్వ ప్రమాణాలు.ఈ మూర్ఖున్ని సమర్థించే మర్రిన్ని మూర్ఖపు మూకలు మీడియా ముందుకొచ్చి చిన్డులేస్తున్నాయి..
ఇలాంటి పరిస్థితుల్లో రేపు శ్రీకృష్ణ కమిటి రిపోర్ట్ ఇచ్చినా దాన్ని ఎవరన్నా ఖాతరు చేస్తారా అనేది నేడు తెలంగాణా ముందున్న పెద్ద ప్రశ్న.అందుకే ఓరుగల్లు సమర ఢంకా తో తెలంగాణా తెలిపింది ఇక మేము సై అంటే సై ,ఇక మా నరం నరం ఒకే స్వరం ,సమరమే ఇక మా పథం .

Tuesday, May 25, 2010

ఓదార్పు మాకొద్దు..!

తెలంగాణా చైతన్యాన్ని ,తెలంగాణా వాదం బలాన్ని,ఈ ఆత్మగౌరవ పోరాటాన్ని ఎలా అభినందించాలో అర్థంకావట్లేదు.
రాష్ర సాధనకై అసువులు బాసిన అమరులు నిజంగా ఇవాళ సంతోషిస్తారు,వాళ్ళు మరణించినా ,వాళ్ళ వాదం,భావజాలం బ్రతికిఉన్నన్దుకు.ఆర్థిక సాయం పేరుతో తెలంగాణా లో సమైక్య వాణిని వినిపించడానికి వస్తున్న జగన్ ఓదార్పు యాత్ర,దానికి తాన తందానా అంటున్న కొంతమంది చంచాలు..గొప్పను కొని పోయారు తెలంగాణా పల్లెల్లోకి..డబ్బులిస్తాం అని..వీళ్ళని కనీసం కలవడం ఇష్టం లేని పృథ్వీ తల్లితండ్రులు,ఇంటికి తాళం వేసి ,ఉత్తరం పెట్టి వెళ్లారు,ఇస్తే నా బిడ్డ ప్రాణాలు ఇయ్యండి,లేకుంటే తెలంగాణా ఇవ్వండి ఆని..మరో రాజ్ కుమార్ కుటుంబం తెలంగాణా ఇవ్వండి ,ఆంధ్ర వాడి దగ్గర సాయం తెసుకోము ఆని తెగేసి చెప్పారు..తిరస్కరించారు..కొండ సురేఖ గారు ఇంకా చేసిన తప్పుకి నాలుక కర్చుకున్నారో లేదో..జగన్ గారు ఖంగు తిన్నారో లేదో..కాని తెలంగాణా తల్లితండ్రుల త్యాగానికి తెలంగాణా అంతా సలాం పలుకుతుంది..
అటు వరంగల్ బంద్,ఇంకో వైపు ysr విగ్రహం ద్వంసం ,మరో వైపు చలో మహబూబాబాద్,జగన్ మీద సొంత పార్టీ తెలంగాణా నేతల ఆగ్రహం..నేను పట్టుకున్న కుందేలుకి మూడే కళ్ళనే యువరాజావారి మంకుపట్టు...కోరి అవమానాల పాలైతా అంటే ఎవెరెందుకు ఆపడం..రానివ్వండి...నిన్న లేని ధైర్యం ఇవాళ ఉంది..నేతలు రాతలు మరకున్నా ప్రజా శక్తి లో కొత్త మార్పు చేకూరింది..ఇపుడు నిలదీస్తారు ,ఉతికి ఆరేస్తారు ఆని నమ్మకం ఉంది.. ఇపుడు పోరాడితే పోయేది ఏమి లేదు ,ఆంధ్ర బానిస సంకెళ్ళు తప్ప..

Thursday, May 13, 2010

సింహాలు..గుర్రాలు..ప్రజా పథాలు..ఓదార్పు యాత్రలు..నిట్టూర్పులు.

ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికలు లేకున్నా,వడగాల్పులు వీస్తున్నా ,ఎండనక,కష్టమనుకోక పర్యటనల మీద పర్యటనలు చేస్తున్నాయి.ముందుగా బాలకృష్ణ సింహ సినిమా హిట్ యాత్ర,పార్టీ అధ్యక్ష పదవి ముందు ముందు తెస్కోవచ్చు అని సూచించడం,చంద్రబాబు సై అనడం,ఇప్పుడైతే రాజ్యసభ కెల్త ,ముఖ్యమంత్రి పదవి ఇప్పుడే అవసరంలేదని చేపుకోవడం...బాలకృష్ణ గారి సినిమా కంటే ఈ కత కొంచం ఆకర్షనీయంగా ఉన్నా.. బాలకృష్ణ గారికి ,చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఆశలు ఉన్నాయి ,తెలంగాణా జనాలు మల్లి మల్లి వేర్రోల్లై వీళ్ళకి వోట్ వేస్తారు,గెలిచేస్తారు,పదవులు పంచుకునే పనిలో మునిగిపోయారు..వెర్రి జనం విస్తు పోయి చూస్తున్నారు.

మరో సినిమా స్టార్..చిరంజీవి..ఈయన రాజకీయాల్లోకి వచ్చినా నటించడం వదలట్లేదు ,రాజకీయం నేర్వట్లేదు..ఈల వేస్తె అభిమానికి క్లాస్..గుర్రపు స్వారి...పోలవరం మీద ప్రత్యేక ప్రేమ..దాని మీద పోరాటం..అక్కడి జనాలు అందలం ఎక్కిస్తున్నారో లేదో తెలీదు కాని ,ఇక్కడి జనాలు గాడిద మీద ఎక్కించి స్వారి చేయిస్తున్నారు..ఈయన్ని విమర్శించడం కూడా వృధా ,ఎందుకంటే తెలంగాణలో prp అంటే ప్రజలు లేని పార్టీ.ఇక్కడ తాగడానికి గుక్కెడు నీళ్ళు దొరకక ప్రజలు అల్లాడుతుంటే అక్కడ మూడో పంటకు వేసే ప్రాజెక్ట్ మీద ఈయన ఏనామాలిన ప్రేమ.. జనాలు అసహాయులై ఈ నాటకం చూస్తున్నారు..

రోశయ్య గారి ప్రజాపథం,జగన్ గారి ఓదార్పు వ్రతం..పాలకపక్షం కాంగ్రెస్ ఏ ,ప్రతిపక్షం కూడా కాంగ్రెస్ ఏ.తెలంగాణా ఇచ్చేది నేషనల్ కాంగ్రెస్ ,తెచ్చేది తెలంగాణా కాంగ్రెస్,ఆపేది ఆంధ్ర కాంగ్రెస్..ఈ మాయాబజార్ నాటకం కాంగ్రెస్ ఇప్పట్లో ఆపేలా లేదు..ఉప ఎన్నికల్లో వీళ్ళని గెలిపిస్తే తెలంగాణా కు బలం వస్తుందట పొన్నం గారి వ్యాఖ్య.. పదవులకు అమ్ముడుబోయే గొప్ప గొప్ప నాయకులు ఈ తెలంగాణా గడ్డ మీద ఎందుకు పుట్టారా అని జనాలు ఈసడించుకున్న వీళ్ళకి వినిపించదు ,కనిపించదు..

ఇంత వాడి వేడి నాటకం జర్గుతుంటే జనాలు నిట్టుర్పులకి పరిమితమయ్యారు..ఎందుకంటే ప్రజాస్వామ్యం లో అతి బలహీనమైన జీవులు ప్రజలే...ఈ సారి ఉపఎన్నికల్లో వోటు ని వాడుకుంటారో,అమ్ముకుంటారో,తెలీదు కానీ ఈ నేల మీద పుట్టబోయే బిడ్డల భవితవ్యం ఏ తేరుకోలేని నిశీధి లోకి నేట్టివేయబడుతుందో ఆలోచించుకోవడానికి భయం గా ఉంది..