Wednesday, February 3, 2010

తెలంగాణ గోరింట సెగలు....

ఇప్పుడు రాసే ప్రతి అక్షరం లోను ఉద్వేగం ఉంది,నిన్నటి తెలంగాణ ఆవేశం ఉంది,రేపటి తెలంగాణ కై ఆశ ఉంది,అన్నిటికన్నా చరిత్ర ను వక్రీకరించకుండా, ఒక సామాన్యుని కోణాన్ని, ముందు తరాలకు భద్రపరచాలన్న ఆకాంక్ష ఉంది,ఆ భాద్యత కూడా నాలాంటి చదువుకున్న విద్యార్థులు మీద ఉంది.
తెలంగాణ కోటి రతనాల వీణ,నిజాము నిరకుషత్వం లో,సీమంధ్ర అనిచివేతలో,తీగలు తెగి ,అగ్ని లో తోయబడి,నేడు విప్లవ రాగాలు పలుకుతున్న రుద్రవీణ ఇది.1969 లో తూటాలకు ,2009-10 లో అత్మహుతులకు రక్తం లో తడిచి ,మంటల్లో కాలి ,ఈ నేల గోరింట సెగల తెలంగాణ గా మారింది .
ఇలాంటి చారిత్రిక ఉద్యమం లో పాల్గొనే అవకాశం వచ్చిన వాళ్ళందరం అదృష్టవంతులం.ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు,అధర్మం వైపు నిలిచేవాడు ఎంత దోషో,ప్రేక్షక పాత్ర వహించేవాడు అంటే దోషి,ఇది నేను చదివిన భగవద్గీత,నేను నమ్మిన కృష్ణుని మాట.యధ్రుచికమే కానీ ఇవాలే జస్టిస్ శ్రీకృష్ణ అద్వర్యం లో కమిటీ ఏర్పడింది.విధి విధానాలు ఖరారు కాలేదు కానీ ,నిరాశ పరిచేలా ౩ ఏళ్ల కాలపరిమితి అని వార్తలు వస్తున్నాయి.పాండవులు 5 ఊల్లు అయనా పర్లేదు అని కృష్ణుడిని కౌరవుల దగ్గ్గరికి రాయబారం పంపారట మన తెలంగాణా కాంగ్రెస్ ప్రజాప్రతినిదుల్లా,ద్రౌపదీ అన్నా మరి నాకు జర్గిన అవమానానికి సమాధానం లేదా?అని బాధను వెల్లడించింది,తెలంగాణా తల్లి లా.ఈ శ్రీ కృష్ణ రాయబారం విఫలమైతే,తర్వాత జరిగే కురుక్షేత్రం సీమంధ్ర ప్రజలు కొని తెచ్చుకునే పెను ప్రమాదం.
తెలంగాణ ఉద్యమం ఈ దఫా ఇప్పటివరకు చాల శాంతియుతంగా జరిగింది,అయినా ఇందులో అసాంఘిక శక్తులు చొరబాడ్డాయని నివేదికలు,వ్యాఖ్యానాలు.సాధారణ పరిస్థితుల్లో ఆయుధాలతో సాధిస్తాం అనే సిద్దాంతాన్ని నేను నమ్మకున్నా,జరిగేది తెలంగాణా విముక్తి పోరాటం,మరో దఫా స్వతంత్ర పోరాటం,ఇటువంటి పరిస్తితిలో అతివాదుల నైనా ,మితవాదుల నైనా,సమానంగా గౌరవించాలి.అయినా ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షను రాజకీయ పార్టీలు గౌరవించకుండా,వాళ్ళ భావాలతో,బతుకులతో ఆడుకుంటుంటే ,కంచే చేను మేస్తే అన్నట్టు ప్రభుత్వాలు ,ప్రతిపక్షాలు ప్రజల్ని మోసం చేస్తే ,వాళ్ళ గోడు ఎవరు వినాలి,వాళ్ళని ఎవరు ఆదుకోవాలి.
తెలంగాణా ప్రజలకు ఇపుడు ముందున్న ప్రశ్న,ఇంతలా పోరాడం ,అందరం ఒక్కటై గొంతెత్తి చాటం,అయనా పెట్టుబడిదారుల ముందు ప్రజలు ఓడిపోతూనే ఉన్నారు.ఇంకెలా పోరాడాలి,పోరాటానికి దిశా దశ ఏంటి? ఈ సంఘర్షణలో చాలామంది నిరాశానిస్పృహల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.సమైక్య వాదం చేసేవాళ్ళు కనీసం జాలి, మానవత్వం లేకుండా ,ఆత్మాహుతి దళాలు ,ltte లాంటి తీవ్ర పదజాలం తో ఇక్కడి ప్రజల గాయాల పై కారం పూస్తున్నారు.నిజానికి ఇవాళ ఆంధ్రకైన,తెలంగాణా కైనా నిజమైన అసాంఘిక శక్తులు ఈ పెట్టుబడిదారులే.
తెలంగాణా లో తెలంగాణా వాదం లేదంటే నవ్వొస్తుంది,దీన్నిఏదో మంత్రం వేసి అపగలమనుకుంటే అది అవివేకం కాక మరొకటి కాదు.నాకు తెలంగాణా ఉద్యమం తో మొట్ట మొదటి పరిచయం అయింది నా 10th క్లాస్ లో అంటే పదిహేడేళ్ళ వయసులో ,అది ఏదో మాటల సందర్భం లో కృష్ణ,గోదావరి నదీ ప్రవాహాల విషయం లో ,తెలంగాణకు జర్గుతున్న నీళ్ళ దోపిడీ గురించి.ఆ రోజు నేను అక్కడే మరిచిపోయిన విషయం ,ఎవరైనా పెంచి పోషించారంటే అది ఈ సీమంధ్ర పాలకుల వ్యవహారాలే.జర్గుతున్న అన్యాయాన్ని ,దోపిడిని,అనిచివేతను భరించలేక,చరిత్రను చదవాల్సి వచ్చింది,పరిష్కారం ఆలోచించాల్సి వచ్చింది,ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనే మార్గం అని తేల్చుకోవాల్సి వచ్చింది.ఈ ఆరేళ్ళ లో ఉద్యమం ఇలాగే అందరి మనస్సులో ఎదుగుతూ వచ్చిందేమో,అసలు ఈ యాభై మూడేళ్ళలో నివురు గప్పిన నిప్పులా,నిర్విరామంగా ఉద్యమం నడుస్తూనే ఉందేమో.ఇవాళ సంవత్సరం పాప జై తెలంగాణా అంటుంటే,ఐదేళ్ళ పిలగాడు బండెనక బండి కట్టి ...అని పాట పాడుతుంటే, ఉద్యమం ఈ నేల వారసత్వమై విరజిల్లుతుంటే,ఈ తపస్సుకు ఏదో రోజు భాగీరధ ప్రయత్నం లా ఫలించి ,స్వతంత్ర గంగ ఈ నేల మీదికి పరుగులు తీస్తూ రాదా,ఆ అమరుల ఆత్మలకు ముక్తి చెకూర్చదా ..

1 comment:

corrival said...

Good one keep it up..!!! Jai Telangana....