Monday, December 27, 2010

రగులుతున్న తెలంగాణా..


రగులుతున్న తెలంగాణా రణ స్థలమై నిలువనుంది,

మరుగుతున్న అగ్ని జ్వాల అఖండమై ఎగియనుంది,

పారాహుషార్ ప్రభువులారా ! ప్రళయం రానుంది,

రాజకీయ చదరంగానికి చరమ గీతం పాడనుండి.


చిట్టిచీమలు జట్టుగట్టి పాముల పనిబట్టినట్టు,

వానర సైన్యం పట్టుబట్టి లంకను జయించినట్టు,

'ఒక ఆజాద్ హింద్ ఫౌజ్ ' ఆంగ్లేయులను తరిమినట్టు,

సర్ఫరోషి కి తమన్నా "అని భగత్ సింగ్ కదిలినట్టు,


తండ తండా కదలనుంది,టూటాకో తల పెట్టనుంది,

వీధి వాడా సహాయనిరాకరణ తో పోరాటాన్ని ఎక్కుపెట్టనుంది,

ఉరి శిక్షలకు భయపడని పులి బిడ్డల పురటి గడ్డ,

బానిస సంకెళ్ళను దెంచ కదిలె తెలంగాణా పోరుగడ్డ.


కవి నాల్కేన శారదుంటే ,రాబోయే తెలంగాణ

ఉద్యమ కొలిమిన పండిన మేలిమి సువర్ణం.

ఇక అడ్డుకుంటే అభాసుపాలు,కాదంటే కదనమే నేడు,

ప్రజాస్వామిక పోరాట ప్రభంజనం లో పతనమే వీరు..

జై తెలంగాణ..!

Monday, December 20, 2010

కాంగ్రెస్ కపటాల కోట ..

తెలంగాణా కన్నీటి కథ తో వ్యాపరం చేయడం కాంగ్రెస్ కి తెలిసినంత ఎవరికీ తెలీదేమో ..అధికార గర్వమో ,ఆహంకారమో తెలీదు కాని అందలం ఎక్కించిన వాళ్ళని తన్నే సంస్కృతి చాలా బలంగా నాటుకపోయింది..అధిష్టానం ఓ దృతరాష్ట్రుడు.,మా ఆంధ్ర నాయకులు దుర్యోధన ,కర్ణులు..శ్రీకృష్ణుడు రాయబారం చేసినా ఉపయోగం ఏంటి.. డిసెంబర్ 31 కోట్ల ప్రజలు ఎదురుజూస్తున్నారు కొత్త సంవత్సరం కొరకు కాదు,కొత్త వెలుగు కొరకు,బిడ్డల కొత్త భవిష్యత్తు కొరకు..వాళ్ళ ఆశలు ఆవిరై, దుక్కం కన్నీరై రాలాల్సిందే..పొన్నం గారు అమ్మ కి ప్లీనరీ లో వినతి చేసారు,మిగితా కాంగ్రెస్ వాళ్ళు వంత పాడారు.. జరగ బోయే దేంటో ,రిపోర్ట్ లో ఏముందో, వాళ్ళ అమ్మ ఏమి రాయిన్చిందో తెలిసి నాటకాలకు తెర దిన్చట్లేదు..తెలంగాణా చేస్కున్న దురదృష్టం నిజంగా ఒక్కడు ఎదిరించి తెలంగాణా కోసం నిలబడలేదు ..నిజంగా చవటలు,దద్దమ్మలు అని k.c.r 25 లక్షల మంది సాక్షిగా తిట్టినా ఆత్మ గౌరవం ఉన్నాడు ఒక్కడు లేదు..నారాజు గాకుండ్రి,ఆగం ఆగం గాకుండ్రి ఇంత కంటే విడమరిచి ఎలా చెప్పాలో ఆ నాయకునికి అర్థంకావట్లేదు .. తెలంగాణా లో పరిస్థితి ఉహించుకునే ధైర్యం మాకెవరికి లేదు...ఎవరి ఎవరి నని ఆపుతాం, ఏ ఊర్లో ఏ వాడలో ఎవరిని ఉరి తాళ్లకో,సెల్ టవర్లకో ,పెట్రోల్ మంటలకో బలికాకుండా కాపలా గాస్తం..కేసు లున్న యువత నక్షలైట్లు కాకుండా ఎలా ఆపుతాం..
తెలంగాణా రాష్ట్రం మరో రెండేళ్ళకో,మూడేళ్ళకో ఏర్పడక తప్పదు..కాంగ్రెస్ కాకుంటే b.j.p ఇస్తది,తెచ్చుకుంటాం కాని ఇంకా ఎంత మంది సమిధలు కావాలి..ఎంత రక్తపాతం జరగాలి..మమ్మల్ని చంపి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఉంచండి లేదా మా తెలంగాణా మాకిచ్చి బతకనివ్వండి..ఒక ప్రాంతాన్ని మరో ప్రాంతానికి బానిసలుగా మార్చే హక్కు కాంగ్రెస్ కి ఎవరిచ్చారు .అణు ఒప్పందం కోసం ప్రభుత్వం కులినా పర్లేదు ,తెలంగాణా కోసం అలా కుదురదు ..మంత్రి పదవి కోసం రాజీనామా అంటే రెడీ ..తెలంగాణా కోసం అంటే కుదురదు .. మీ కొడుకు ప్రధాన మంత్రి కావాలి..మా తల్లులు కడుపు కోతకి ఏడవాలి..కుంభకోణాలు ,రాజకీయ ప్రయోజనాలు తప్పితే ప్రజలు,ప్రజల ప్రయోజనాల ధ్యాసే ఉంటె కదా..అంత గొంతెమ్మ కోరిక అడిగామా,చిదంబరం మాట్లాడిన రోజు మంచో చెడో మీకు తెలీదా ? ఇంత మంది ప్రాణాలు తీసే అధికారం మీకుందా? ప్రకటన మీ ఇష్టం,వెనక్కి పోవడం మీ ఇష్టం,కమిటీ మీ ఇష్టం,దాని రాత మీ ఇష్టం..మీ కమిటీ రిపోర్ట్ వినక ముందే మేము తేల్చి చెప్తున్నాం,మీ కాంగ్రెస్ కి తెలంగాణా కమిటి ఉరి శిక్ష ఖాయం చేసింది..ఇక్కడో 125 ఏళ్ళు మీ పార్టీ కొట్టుకపోవడానికి మీ చేతి రాత మీరే రాసుకున్నారు..
ఇదంతా మీకర్థంయ్యే ఇటలీ భాష కాదు..మీ పుత్రరత్నానికి ప్రేమ రావడానికి మాది లష్కరే తోఇబా లాంటి సంస్థ కాదు..
తప్పు చేతికి అధికారం ఇచ్చాక ప్రజలు ఈ మాత్రం అనుభవించాలి మరి..