Wednesday, June 23, 2010

మిగిలేది ఏదైనా మనది..

ఎన్నికల నగారా మోగింది..అన్ని పార్టీలు పోటి కి సిద్ధం..తెలంగాణా తెచ్చేది నేనే అని d.s (d.శ్రీనివాస్) గారి వాదన.
తెలంగాణా తెచ్చేది ,వచ్చేది నాకు తేలీదు కాని,ఒక సామాన్య తెలంగాణా బిడ్డ గా pcc అధ్యక్షుల వారిని అడగాలనుంది..మిమ్మల్ని ఇన్ని ఏన్ల నుండి నిజామబాద్ అక్కున చేర్చుకుంది,తెలంగాణా పెంచి పోషించింది,మీరు మాత్రం తెలంగాణా తల్లిని తాకట్టు పెట్టారు..ఉస్మానియా చెల్లి ని వీధిపాలు చేసారు..మానుకోట తమ్మున్ని తుపాకీ పాలు చేసారు..
మీ ఇంటి అడబిడ్డల్ని అరాచకంగా ఆంధ్ర పోలిసిలు అవమానిస్తుంటే ,ఆ రాత్రి కళ్ళు లేని దృతరాష్ట్రుడై కుర్చున్నారా..లేకుంటే మా ఆత్మగౌరవాన్ని సీమంద్రులకి తాకట్టు పెట్టి pcc పదవి పొందారా? మిమ్మల్ని గెలిపిస్తే వచ్చేది తెలంగాణా కాదు..ఇంటింటికి ఒక అమాయకుని శవం,గంట గంట కి అడబిడ్డకి అవమాన భారం,మునిగిపోయే భద్రాచలం...
ఇంకా
మోసం చేయండి..తెలంగాణా చేతుల్ని నరికి అందలం ఎక్కండి..
కాంగ్రెస్ ఏం చేస్తే మేమదే చేస్తాం..రెండు నాల్కెల వారి వాదన..ఇచ్చేది,తెచ్చేది,నాన్చేది,ఆపేది అన్ని కాంగ్రెస్ ఏ,తెలంగాణా లో ఈ సారి చచ్చేది కూడా కాంగ్రెస్ ఏ,మరి ఆ జాబితా లో చేరడానికి మీరు సిద్ధం అయతే మాకు అస్సలు అభ్యంతరం లేదు..మీకు తెలంగాణా ఇస్తే అభ్యంతరం లేదు..సమైక్యాంధ్ర ఉంటె నష్టం లేదు..మీకంటూ ఒక విధివిధానం లేదు..అందుకే ప్రజలకి మీ పార్టీ అస్సలు అవసరం లేదు..అమరవీరుల కుటుంబాలకి election టికెట్లు ఇస్తాం.. మా అమరత్వాన్ని ఒక్క టికెట్ తో కోనేస్తారా?పోనీ మీరు రాజీనామా చేసిన చోట్లు కాదె?అత్త సొమ్ము అల్లుడు దానం చేసే తంతు.
.కొన్ని వాదాలు వినిపిస్తున్నాయి రాజీనామా చేసిన వాళ్ళు నిలబదోడ్డు.ఇస్తే అమరుల కుటుంబాలకి టికెట్ ఇవ్వాలి,లేదా election ఏ జరగొద్దు..రాజకీయ సంక్షోభం మంచిదే కాని జరిగే పరిస్థితులు లేవు..రాజీనామా నిజంగా పెద్ద త్యాగం కాకపోవచ్చు..కానీ ఒక మార్గదర్శనం..ప్రజలు హత్తుకున్నారు,గుండెల్లో పెట్టుకున్నారు,మమ్మల్ని గెలిపించారు..ప్రజావాణి తెలంగాణా నే అని చాటి చెప్పడానికి..ఎన్నికల తో తెలంగాణా రాదు..కానీ ఎన్నికలే ఓడిపోతే తెలంగాణా ఒక తీరని స్వప్నం లా మిగిలిపోయే ప్రమాదం ఉంది..
ఇక చిరంజీవి గారు గుర్రం ఎక్కి షికారు పోయినపుడు తెలీలేదు ..ఇప్పుడు కనిపించిది పార్టీ తెలంగాణా లో మూసుక పోయింది అని..ఊరుకుంటారా సమైక్యాంధ్ర అంటే తెలంగాణా కి వ్యతిరేకం కాదని వింత,వక్ర భాష్యం..వోటు,నోటు తప్పితే ఈయనకు ఇటు తెలంగాణా తెలీదు , అటు ఆంధ్ర అర్థంకాదు..ఇక్కడ తన్నాలి అక్కడ తరమాలి..
మూడు తరాల ఉడిగం చాలు..ఈ తరం ఈ యుద్ధం చేయకపోతే..రాబోయే తరం కట్టుబానిసలుగా,పుట్టు బానిసలుగా మిగుల్తారు..శ్రీకృష్ణ కమిటి రిపోర్ట్ మరో చిదంబర రహస్యం లా ఉండొచ్చు..కాంగ్రెస్ మరో మోసానికి సిద్ధం కావొచ్చు..
కాని ఇవాళ అర్థం కావాల్సింది ఒకటే IF CONGRESS WANTS TO KEEP UNITED ANDHRAPRADESH
THEN IT SHOULD GET READY TO KILL 4CR OF TELANGANA PEOPLE..ఉంటె స్వరాజ్య తెలంగాణా ఉండాలి లేకుంటే స్మశాన సమైక్యాంధ్ర మిగులాలి..ఆంధ్రుల చరిత్ర రేపటి మానవ ప్రపంచం ఈసడిన్చుకోవాలి..
తెలంగాణా రాదని తెల్సిన క్షణం ఒక కెసిఆర్ కాదు..4 కోట్ల తెలంగాణా ఆమరణ దీక్షకి కూర్చోవాలి.. రోజుకో రైతు ఆత్మహత్య..దినానికో చేనేత కార్మికుని మృతి..ఆశ కోల్పోయే గుల్ఫ్ బాధితుడు..భవిష్యత్తు లేని విద్యార్థి లోకం..వేధింపు చర్యలతో ఉద్యోగి వర్గం..గ్రీన్ హుంట్ లో అసువులు బాసే అన్నల పోరాటం..రోజుకో పిరికి చావు కన్నా,ఒకే రోజు ఒకే యుద్ధం..విజయమో వీరస్వర్గమో..అందరిది..మిగిలేదేదైనా మనది..